రియల్టర్లతో పేకాట... హీరో నాగశౌర్య విల్లాపై ఎస్వోటీ పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-11-01T03:53:18+05:30 IST
యువ హీరో నాగశౌర్య విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం నిర్వాహకుడు విల్లా ..
హైదరాబాద్: యువ హీరో నాగశౌర్య విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం నిర్వాహకుడు విల్లా అద్దెకు తీసుకున్నారు. 30 మంది రియల్టర్లతో పేకాట ఆడిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. రూ.6.7 లక్షల నగదు , 33 సెల్ఫోన్లు, 3 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడి కోసం పోలీసులు గాలించారు. ఆరు నెలల క్రితం యువ హీరో నాగశౌర్య నార్సింగిలో విల్లాను అద్దెకు తీసుకున్నారు.