పోలీసుల ‘స్పందన’ పునః ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-27T06:19:36+05:30 IST

నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సోమవారం స్పందనలో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

పోలీసుల ‘స్పందన’ పునః ప్రారంభం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా

విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సోమవారం స్పందనలో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కరోనా కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. కేసుల తీవ్రత అదుపులోకి రావడంతో పునఃప్రారంభించారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో కరోనా నిబంధనల మధ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ అడ్మిన్‌ వి.రజిని పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:19:36+05:30 IST