కూలిన పెంకుటిల్లు.. శిథిలాల కింద వృద్ధురాలు
ABN , First Publish Date - 2020-07-13T16:14:08+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరంలో రాత్రి కురిసిన వర్షానికి పెంకుటిల్లు కుప్పకూలిపోయింది.
విజయవాడ: కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరంలో రాత్రి కురిసిన వర్షానికి పెంకుటిల్లు కుప్పకూలిపోయింది. ఇంటిలో నివసిస్తున్న వీరవల్లి సీతా మహాలక్ష్మి( 80) అనే వృద్ధురాలు శిథిలాల కింద ఉండిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని వృద్ధురాలిని సురక్షితంగా బయటికి తీశారు.