గోదావరిలో దూకిన యువకుడిని కాపాడిన పోలీస్

ABN , First Publish Date - 2020-08-11T19:47:08+05:30 IST

జొన్నాడు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో పడిపోయిన ఓ యువకుడిని హెడ్ కానిస్టేబుల్ కాపాడారు.

గోదావరిలో దూకిన యువకుడిని కాపాడిన పోలీస్

తూ.గో.జిల్లా: జొన్నాడు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో పడిపోయిన ఓ యువకుడిని హెడ్ కానిస్టేబుల్ కాపాడారు. ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రభాకరరావు రావులపాలెం వెళుతుండగా యువకుడు నదిలో పడిపోయిన విషయం గమనించారు. వెంటనే ఆలస్యం చేయకుండా లారీని ఆపి అందులో ఉన్న తాడు తీసుకుని కిందికి వదిలారు. ఆ తాడు స్థానికుల సాయంతో బాధితుడిని పైకి లాగి రక్షించారు.


కపిళేశ్వరపురం మండలానికి చెందిన రమేష్ బ్రిడ్జిపైనుంచి కిందకు ఎలా పడిపోయాడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయాడని, సెల్ఫీ తీసుకుంటూ జారి పడిపోయాడని, పెట్రోల్ కోసం వేచిచూస్తూ బ్రిడ్జి గోడపై కూర్చున్నప్పుడు కిందకు పడిపోయాడని, కావాలనే నదిలోకి దూకాడని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా సరైన సమయంలో యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్‌ను అంతా అభినందిస్తున్నారు.

Updated Date - 2020-08-11T19:47:08+05:30 IST