కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-02-28T17:20:21+05:30 IST

జిల్లాలోని కంచికచర్ల మండలంలో పోలీసులు దాడులు చేపట్టారు. జోరుగా సాగుతోన్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పక్కా సమాచారంతో గొట్టుముక్కల...

కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలంలో పోలీసులు దాడులు చేపట్టారు. జోరుగా సాగుతోన్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పక్కా సమాచారంతో గొట్టుముక్కల గ్రామంలో పేకాట శిబిరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో పేకాట ఆడుతూ 13 మంది పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి సుమారుగా రూ.95,090 నగదు, 11 బైక్‎లు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-28T17:20:21+05:30 IST