నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-08-13T22:14:47+05:30 IST

నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి

నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి

కృష్ణా: జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ బీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై రెడ్డిగూడెం ఎస్సై శ్రీనివాస్ దాడులు చేశారు. రెడ్డిగూడెం మండలం కూనపురాజు పర్వగ్రామ శివార్లలో బెల్లపు ఊట ధ్వంసం చేశారు. సారా తయారీ కోసం దాచి ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊటను రెడ్డిగూడెం ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ధ్వంసం చేశారు. సారా తయారీ కోసం ఎవరైనా ప్రయత్నించినా, అక్రమ సారాదారులు ఎవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Updated Date - 2020-08-13T22:14:47+05:30 IST