Mahanaduకు వచ్చేవారికి పోలీసుల అడ్డంకులు

ABN , First Publish Date - 2022-05-28T21:33:48+05:30 IST

మహానాడుకు వచ్చేవారిని పోలీసు యంత్రాంగం ఇబ్బందులకు గురిచేస్తోంది.

Mahanaduకు వచ్చేవారికి పోలీసుల అడ్డంకులు

ఒంగోలు: మహానాడుకు వచ్చేవారిని పోలీసు యంత్రాంగం ఇబ్బందులకు గురిచేస్తోంది. వాహనాలు నిలపడానికి 45 ఎకరాల పార్కింగ్‌ స్థలం ఉన్నప్పటికీ వాహనాలను రోడ్డు మీదే నిలిపివేసి టీడీపీ నేతలు, కార్యకర్తలను  ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తల కంటే  పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ.. వాహనాలను రోడ్డు మీదే పోలీసులు నిలిపేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానాడుకు వచ్చే వాహనాలను 5కి.మీ. దూరంలో నిలిపివేస్తుడడంతో మహానాడు ప్రాంగణానికి వచ్చేందుకు టీడీపీ శ్రేణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పోలీసుల తీరుతో మహానాడుకు వెళ్లే రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలను రోడ్లపై ఆపి  పోలీసులు టైర్లలో  గాలి తీసేస్తున్నారని టీడీపీ నేతలు  పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కొందరు పోలీసులమని వచ్చి వేధిస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-28T21:33:48+05:30 IST