Delhiలో బాంబు పేలుడు బెదిరింపు...పోలీసులు అలర్ట్

ABN , First Publish Date - 2022-03-23T16:12:06+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బాంబు పేలుడు జరుగుతుందని ఈ-మెయిల్ బెదిరింపు రావడంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు....

Delhiలో బాంబు పేలుడు బెదిరింపు...పోలీసులు అలర్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బాంబు పేలుడు జరుగుతుందని ఈ-మెయిల్ బెదిరింపు రావడంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈమెయిల్ పంపిన వారు తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఇండియా సంస్థకు అనుబంధంగా పని చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.బాంబు పేలుడు బెదిరింపుతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు నిఘా పెంచారు.మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.బాంబు పేలుడు ముప్పు దృష్ట్యా ఢిల్లీ పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు.



సరోజినీ నగర్ మార్కెట్ ప్రెసిడెంట్ అశోక్ రాంధవా మాట్లాడుతూ భద్రతాపరమైన ముప్పు ఉన్నందున స్థానిక పోలీసులు మార్కెట్‌ను ముందుగానే మూసివేశారన్నారు. ఢిల్లీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఢిల్లీ వీధుల్లో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.

Updated Date - 2022-03-23T16:12:06+05:30 IST