రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను అవ‌మానించిన స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌... గ్రామంలో ఆందోళ‌న‌!

ABN , First Publish Date - 2020-08-13T12:39:29+05:30 IST

యూపీలోని రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌కు సిద్ధం చేసిన రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను ఎస్ఐ కాలువ‌లో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు...

రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను అవ‌మానించిన స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌... గ్రామంలో ఆందోళ‌న‌!

దేవ‌రియా: ‌యూపీలోని రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌కు సిద్ధం చేసిన రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను ఎస్ఐ కాలువ‌లో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగి, పోలీసుల‌కు వ్య‌తిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కిషోర్ ఘ‌ట‌న జ‌రిగిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామ‌స్తుల‌ను శాంతిప‌జేసి, ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌పై చ‌ర్య‌లకు ఉపక్ర‌మించారు. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి పూజ‌లు నిర్వ‌హించేందుకు ఎస్డీఎం నుంచి అనుమతి కూడా తీసుకున్నామ‌ని గ్రామస్తులు తెలిపారు. అయితే స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ జయంత్ కుమార్ సింగ్ గ్రామానికి వెళ్లి, పూజలు నిలిపివేయాల‌ని కోరారు. గ్రామస్తులు నిరాక‌రించ‌డంతో స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆ రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను చెరువులో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మాచారం అందుకున్న డీఎం, ఎస్పీ గ్రామానికి చేరుకుని, స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని హామీ ఇవ్వ‌డంతో గ్రామస్తులు శాంతించారు. కాగా క‌రోనా వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడంపై నిషేధం ఉందని ఎస్పీ తెలిపారు. అందుకే ఆ ప్ర‌తిమ‌ల‌ను తొలగించమని స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ కోరినప్పటికీ, గ్రామ‌స్తులు విన‌లేదన్నారు.  ప్రస్తుతం ఈ ఉదంతంపై దర్యాప్తు జ‌రుగుతోంది. 

Updated Date - 2020-08-13T12:39:29+05:30 IST