శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పులు...పోలీసు ఆఫీసర్ మృతి

ABN , First Publish Date - 2021-06-23T10:34:08+05:30 IST

జమ్మూకశ్మీరు శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో పోలీసు ఇన్‌స్పెక్టరు ప్రార్థన కోసం మసీదుకు వెళుతుండగా ఉగ్రవాదులు...

శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పులు...పోలీసు ఆఫీసర్ మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీరు శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో పోలీసు ఇన్‌స్పెక్టరు ప్రార్థన కోసం మసీదుకు వెళుతుండగా ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. పోలీసు ఇన్‌స్పెక్టరు పర్వేజ్ అహ్మద్ మగ్రీబ్ ప్రార్థనల కోసం మసీదుకు వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్వేజ్ అహ్మద్ కు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. పర్వేజ్ అహ్మద్ ను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ ఐజీపీ, డీఐజీ, ఎస్పీ, శ్రీనగర్ టెర్రర్ క్రైం విభాగం అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. పోలీసు బలగాలను రప్పించి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మృతుడు పర్వేజ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అమరవీరుడైన పోలీసు అధికారి పర్వేజ్ కు పోలీసులు నివాళులు అర్పించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం జమ్మూకశ్మీర్ పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-06-23T10:34:08+05:30 IST