అఖిలప్రియ భర్త భార్గవ్‌కు నోటీసులు

ABN , First Publish Date - 2020-06-06T01:33:23+05:30 IST

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు పోలీసుల నోటీసులిచ్చారు. నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను

అఖిలప్రియ భర్త భార్గవ్‌కు నోటీసులు

కర్నూలు: మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు పోలీసుల నోటీసులిచ్చారు. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను కడప పట్టణంలోని చిన్నచౌక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరుకావాలని అఖిలప్రియ భర్తకు నోటీసులిచ్చారు. గత నెల 15న మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణను చిన్నచౌక్ పోలీసులు వేగవంతం చేశారు.


ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నుతుండగా కడప పోలీసులు భగ్నం చేశారు. సుపారీ తీసుకున్న ముగ్గురిని కడపలో చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ఫక్కీర్‌ కొందరు ప్రముఖ రాజకీయ నేతల వద్ద రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదట రూ.15లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. సుబ్బారెడ్డిని చంపేందుకు మార్చి 12న తెల్లవారుజామున 3గంటలకు ఫక్కీర్‌ ఒంటరిగా వెళ్లాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నైట్‌ పెట్రోలింగ్‌ పోలీసులు తిరుగుతుండడంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు.

Updated Date - 2020-06-06T01:33:23+05:30 IST