ఉరేసుకున్న కుర్రాడు.. చీకటిగా ఉందని మృతదేహాన్ని తాడుకే వదిలేసిన పోలీసులు!

ABN , First Publish Date - 2020-06-30T02:38:17+05:30 IST

అర్థరాత్రి ఓ 15ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఉరేసుకున్న కుర్రాడు.. చీకటిగా ఉందని మృతదేహాన్ని తాడుకే వదిలేసిన పోలీసులు!

భోపాల్: అర్థరాత్రి ఓ 15ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో ఉరేసుకున్న ఆ కుర్రాడి మృతదేహాన్ని ఉదయం వరకూ పోలీసులు అలాగే వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో జరిగింది. ఓ అగ్రవర్ణానికి చెందిన కుటుంబంతో గొడవ కారణంగానే సదరు కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. అర్థరాత్రి అక్కడకు చేరుకున్నారని, చీకటిగా ఉందనే కారణంతో తాడుకు వేలాడుతున్న కుర్రాడి మృతదేహాన్ని రాత్రంతా అలాగే వదిలేశారని కుటుంబసభ్యులు చెప్పారు. ‘కరెంటు పోవడంతో ఇక్కడ బాగా చీకటిగా ఉంది. దాంతో గదిలో సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకని పిల్లాడి మృతదేహాన్ని రాత్రంతా తాడుకు అలాగే వదిలేశారు. గది తలుపులు మూసి ఓ కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు’ అని ఆ కుటుంబం తెలిపింది.

Updated Date - 2020-06-30T02:38:17+05:30 IST