పోలీసుల లాఠిన్యం..!

ABN , First Publish Date - 2021-06-25T06:49:46+05:30 IST

పెద్దపప్పూరు మండలం పసలూరుకు చెందిన మహిళను పొలం వివాదంలో ఎస్‌ఐ, ఏఎ్‌సఐ చితకబాదారు. వీరి తిట్లు, దెబ్బలు భరించలేక అవమానభారంతో ఆదిలక్ష్మి గురువారం విషద్రావకం తాగి, ఆత్మహత్యకు యత్నించింది.

పోలీసుల లాఠిన్యం..!
ఆత్మహత్యకు యత్నించిన ఆదిలక్ష్మి

మహిళను చితకబాదిన ఎస్‌ఐ, ఏఎ్‌సఐ

అవమానభారంతో ఆత్మహత్యాయత్నం


తాడిపత్రి, జూన 24: పెద్దపప్పూరు మండలం పసలూరుకు చెందిన మహిళను పొలం వివాదంలో ఎస్‌ఐ, ఏఎ్‌సఐ చితకబాదారు. వీరి తిట్లు, దెబ్బలు భరించలేక అవమానభారంతో ఆదిలక్ష్మి గురువారం విషద్రావకం తాగి, ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు ఆదిలక్ష్మి విలేకరులకు తె లిపిన వివరాల మేరకు.. పసలూరుకు చెందిన అన్నదమ్ములు ఆదినరసింహులు, కేశవనాయుడు మధ్య పొలంగట్టు సమస్య ఉంది. ఈ విషయంలో వీరు బుధవారం గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్‌.. ఆదిలక్ష్మితో పాటు భర్త ఆదినరసింహులు, బావ కేశవనాయుడును స్టేషనకు పిలిపించారు. ఈ సమయంలో ఆదిలక్ష్మిని ఎస్‌ఐ, ఏఏ్‌సఐ మహదేవ్‌ విచక్షణారహితంగా చితకబాదారు. మహిళ అని చూడకుండా బూతు లు తిడుతూ చేతులు, తొడలపై లాఠీలతో చావబాదారు. తన భార్య చనిపోతుందని ఆదినరసింహులు వారి కాళ్లు పట్టుకుని, విలపించినా వదలలే దు. దెబ్బలు భరించలేక ఆదిలక్ష్మి కూడా కాళ్లు పట్టుకుంది. అయినా చావబాదారు. ఈ అవమానభారంతో ఆదిలక్ష్మి విషద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-06-25T06:49:46+05:30 IST