దొరికిన బాలుడిని వెంట తెచ్చేసుకున్నాడు..

ABN , First Publish Date - 2022-05-18T06:34:18+05:30 IST

మండలంలోని డబురువారిపల్లికి చెందిన నరసింహులు.. నాలుగు రోజుల క్రితం కాకినాడ రైల్వేస్టేషనలో దొరికిన నాలుగేళ్ల బాలుడు అభిరాంను వెంట తెచ్చేసుకున్నాడు.

దొరికిన బాలుడిని వెంట తెచ్చేసుకున్నాడు..

ఓబుళదేవరచెరువు, మే 17: మండలంలోని డబురువారిపల్లికి చెందిన నరసింహులు.. నాలుగు రోజుల క్రితం కాకినాడ రైల్వేస్టేషనలో దొరికిన నాలుగేళ్ల బాలుడు అభిరాంను వెంట తెచ్చేసుకున్నాడు. విషయం బయటకు రావడంతో మంగళవారం పోలీసులు, ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన వారికి అప్పగించారు. నరసింహులు కూలి పని నిమిత్తం నాలుగురోజుల క్రితం కాకినాడ రైల్వేస్టేషన వద్ద ఉండగా.. నాలుగేళ్ల అభిరాం దొరికాడు. బాలుడిని వెంటబెట్టుకుని, స్వగ్రామానికి వచ్చాడు. ఇరుగుపొరుగు వారు గమనించి, చైల్డ్‌లైనకు సమాచారం అందించారు. చైల్డ్‌లైన సిబ్బంది మధు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జయమ్మ గ్రామానికి చేరుకుని, విచారించారు. బాలుడిని నల్లమాడ సీఐ నిరంజనరెడ్డికి అప్పగించారు. బుధవారం ఆ బాలుడిని అనంతపురంలోని సీడబ్ల్యూసీకి అప్పగించనున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, చైల్డ్‌లైన సిబ్బంది తెలిపారు.


Updated Date - 2022-05-18T06:34:18+05:30 IST