కరోనా వేళ నేతల సాయంపై పోలీసుల విచారణ
ABN , First Publish Date - 2021-05-15T07:21:45+05:30 IST
కొవిడ్ విజృంభణతో సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కు ఢిల్లీ రాజకీయ నేతలు చేస్తున్న సాయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు
న్యూఢిల్లీ, మే 14: కొవిడ్ విజృంభణతో సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కు ఢిల్లీ రాజకీయ నేతలు చేస్తున్న సాయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరోనా వేళ రెమ్డెసివిర్తో పాటు ఇతర ఔషధాలు, వైద్య పరికరాల ను పంపిణీ చేస్తున్న రాజకీయ నేతలను విచారించాలని, వాటి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించించడంతో పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. బీజేపీ ఢిల్లీ నేతలు గౌతం గంభీర్, హరీశ్ ఖురానానూ పోలీసులు ఇదే అంశంపై ప్ర శ్నించారు. అయితే, ఈ విచారణ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని గంభీర్ అన్నారు. కాగా, తాను సాయం చేస్తుంటే ఆ పనులు ఎ లా చేస్తున్నావంటూ ఢిల్లీ నేర విభాగ పోలీసులు విచారణ నిమిత్తం ప్రశ్నించారని భారతీయ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ చెప్పారు.