పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొనసాగుతున్న విచారణ
ABN , First Publish Date - 2022-04-14T21:22:33+05:30 IST
నగరంలో సంచలనం రేపిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణకొనసాగుతోంది
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణకొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి,విచారించిన పోలీసులు తాజాగా అనిల్, అభిషేక్ను కలిపి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల దాడుల కంటే ముందు అనిల్, అభిషేక్ మధ్య సంభాషణలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య 20 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు నిర్థారణ అయ్యింది. పోలీసులు అనిల్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.పబ్లో ఉన్నవారికి అనిల్ డ్రగ్స్ సరఫరా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.