నల్గొండ: రైలులో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం నేపథ్యంలో మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో తనిఖీలను పోలీసులు నిర్వహించారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలను చేసారు. ఈ తనిఖీలో ముగ్గురు సీఐలు, 25 మంది ఎస్ఐలు,120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.