మానవత్వం చాటిన పోలీసులు

ABN , First Publish Date - 2021-05-10T16:17:14+05:30 IST

కన్న బిడ్డలు రాకున్నా..

మానవత్వం చాటిన పోలీసులు

కరోనా మృతునికి అంతిమ సంస్కారాలు


ఎ.కొండూరు: కన్న బిడ్డలు రాకున్నా.. ఆత్మీయులవలే ముందుకొచ్చి కరోనా మృతునికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకొన్నారు ఎ.కొండూరు పోలీసులు. మాధవరం గ్రామానికి చెందిన జువ్వాజి వెంకయ్య (70) శుక్రవారం రాత్రి కరోనాతో మృతిచెందాడు. మృతుడి కుమారుడు (50) అనారోగ్యంతో ఏమీ చేయలేని పరిస్థితి. మృతునికి దహనసంస్కారాలు నిర్వహిచేందుకు గ్రామంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్సై టి.శ్రీనివాస్‌ తన సిబ్బందితో పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ధరించి మృతదేహన్ని కిలోమీటరు దూరం తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సర్పంచ్‌ భర్త వైకుంఠరావు, పంచాయతీ కార్యదర్శి శివరంగారావు తమవంతు సహకారాన్ని అందజేశారు.

Updated Date - 2021-05-10T16:17:14+05:30 IST