సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్
ABN , First Publish Date - 2020-09-21T17:15:15+05:30 IST
మనిషిలోని తీవ్రమైన ఒత్తిడి ఎటువంటి చర్యకైనా పాల్పడేలా చేస్తుంది. ఇటువంటి ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది. సామోద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న...
జైపూర్: మనిషిలోని తీవ్రమైన ఒత్తిడి ఎటువంటి చర్యకైనా పాల్పడేలా చేస్తుంది. ఇటువంటి ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది. సామోద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ తానుంటున్న పోలీస్ క్వార్టర్స్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్లో కలకలం చెలరేగింది. మృతుని దగ్గర సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సామోద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
ఎస్ఎఫ్ఎల్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పోలీస్ స్టేషన్కు పోలీసు సిబ్బంది అంతా హాజరయ్యారు. అయితే హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ స్టేషన్కు రాలేదు. దీంతో మిగిలిన పోలీసులు శ్రీరామ్ ఉంటున్న క్వార్టర్స్కు వెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి, లోనికి వెళ్లి శ్రీరామ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో చేస్తున్నారు.