గదిలో అంతా రక్తం.. కానీ శవం మాయం.. మహిళ హత్య కేసులో అసలు హత్య జరగలేదని తేల్చిన పోలీసులు.. ఈ మిస్టరీని వారు ఎలా ఛేదించారంటే..

ABN , First Publish Date - 2022-02-08T06:02:21+05:30 IST

పెళ్లైన కొన్ని నెలల వరకు అంతా బాగానే ఉంది. భార్యాభర్లలిద్దరూ ఒకరినొకరు సంతోషంగా ఉన్నారు. భర్త లేని సమయంలో అత్తారింట్లో కూడా ఏ సమస్య లేదు. కానీ ఒకరోజు ఉదయం ఆ నవవధువు గదిలోకి వెళ్లగా.. అంతా రక్తపు మరకలు. గోడలు, నేల అంతా రక్తమే.. కానీ ఆమె మాత్రం లేదు. ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. రక్తం చూసిన ఆడపడుచు అరుపులు, కేకలు వైస్తూ ఇంట్లో అందరినీ పిలిచింది. అంతా గందరగోళంగా ఉండడంతో వధువు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. విచారణ మొదలు పెట్టిన పోలీసులు రెండు నెలల తరువాత అసలు నిజం తెలుసుకున్నారు...

గదిలో అంతా రక్తం.. కానీ శవం మాయం.. మహిళ హత్య కేసులో అసలు హత్య జరగలేదని తేల్చిన పోలీసులు.. ఈ మిస్టరీని వారు ఎలా ఛేదించారంటే..

పెళ్లైన కొన్ని నెలల వరకు అంతా బాగానే ఉంది. భార్యాభర్లలిద్దరూ ఒకరినొకరు సంతోషంగా ఉన్నారు. భర్త లేని సమయంలో అత్తారింట్లో కూడా ఏ సమస్య లేదు. కానీ ఒకరోజు ఉదయం ఆ నవవధువు గదిలోకి వెళ్లగా.. అంతా రక్తపు మరకలు. గోడలు, నేల అంతా రక్తమే.. కానీ ఆమె మాత్రం లేదు. ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. రక్తం చూసిన ఆడపడుచు అరుపులు, కేకలు వైస్తూ ఇంట్లో అందరినీ పిలిచింది. అంతా గందరగోళంగా ఉండడంతో వధువు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. విచారణ మొదలు పెట్టిన పోలీసులు రెండు నెలల తరువాత అసలు నిజం తెలుసుకున్నారు. నిందితులను పట్టకొని.. అసలు హత్యే జరగలేదని తేల్చారు. 


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ నగరంలో నివసించే నీతూ(24) అనే యువతికి అయిదు నెలల ముందు అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి తరువాత నీతూ అత్తారింట్లో ఉంటోంది. ఆ ఇంట్లో ప్రతాప్ తల్లిదండ్రులు, అతని చెల్లెలు, తమ్ముడు కూడా ఉంటున్నారు. ప్రతాప్ ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉండాల్సి వచ్చింది. వారినికి ఒకసారి ఇంటికి వస్తుంటాడు. కానీ భార్యాభర్తలిద్దరూ రోజూ ఫోన్లో భార్యతో గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు రాత్రి నీతూ భోజనం చేసి గదిలోకి వెళ్లింది. ఆ తరువాత భర్తతో ఫోన్లో గంటసేపు మాట్లాడి నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం ఆమె గదిలో నుంచి బయటకు రాకపోయేసరికి ప్రతాప్ చెల్లెలు(ఆడపడుచు) వదినను లేపడానికి గదిలోకి వెళ్లింది. అక్కడ గది పరిస్థితి చూసి భయంతో వణికిపోయింది. 


ఆ గది గోడలపై రక్తపు మరకలు, నేలపై చెల్లాచెదురుగా వస్తువులు. ఆ వస్తువుల కూడా రక్తంలో తడిసి ఉన్నాయి. ఈ దృశ్యం చూసి ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లో అందరినీ పిలిచింది. నీతూ అత్తామామలు, మరిది అక్కడికి వచ్చి చూసి ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. గది మొత్తం రక్తంతో తడిసి ఉంది. కానీ నీతూ మాత్రం గదిలో లేదు. ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. నీతూ తల్లిదండ్రులకు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.


నీతూ తల్లిదండ్రులు ఆమె అత్తమామలే తమ కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపుల నుంచి ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు ముందు నీతూ మరిదిపై అనుమానంతో అతడిని ప్రశ్నించారు. ఆ తరువాత నీతూ భర్త కూడా ఊరి నుంచి వచ్చాడు. ఎవరిని ప్రశ్నించినా పోలీసులకు సమాచారం దొరకలేదు. నాలుగు రోజుల తరువాత పోలీసులకు ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు అందింది. అది చూసి వారంతా షాకయ్యారు. 


ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం గదిలో ఉన్న రక్తం రెండు రకాలుగా ఉంది. ఎక్కువగా జంతువు రక్తం ఉంది. కొద్దిపాటీ మనిషి రక్తం కూడా ఉంది. ఆ రిపోర్టు చూసిన తరువాత పోలీసులు విచారణను కొత్త కోణంలో మొదలుపెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవి వీడియోలు పరిశీలించారు. ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఒక స్కార్పియో కారు వచ్చి ఆగింది. అర్ధరాత్రి తరువాత ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారులో ఎవరు వచ్చారో.. వెళ్లారో స్పష్టంగా కనబడలేదు.


ఆ తరువాత పోలీసులు నీతూ ఫోన్ కాల్ రికార్డ్స్‌ను పరిశీలించారు. అందులో ఒక విచిత్ర విషయం బయటపడింది. నీతూ తన భర్తతో గంటల తరబడి మాట్లాడేది. అలాగే మరో నెంబరుపై కూడా ఆమె చాలాసేపు మాట్లాడేది. ఆ నెంబర్ నుంచి తరుచూ ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఫోన్ రికార్డ్స్‌లో ఉంది. ఆ నెంబర్ ఎవరిదో తమకు తెలియదని నీతూ తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త చెప్పారు. దీంతో పోలీసులు ఆ నెంబర్ గురించి ఆరా తీయగా.. అది పక్కనే ఉన్న ముజఫర్‌పూర్ నగరంలో నివసించే సోనూ అనే యువకుడిదని తెలిసింది.


పోలీసుల బృందం వెంటనే సోనూ ఇంటికి బయలుదేరింది. ఒక్కసారిగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా.. అక్కడ సోనూతో పాటు నీతూ కూడా ఉంది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అప్పుడు వారిద్దరూ నీతూ వివాహానికి ముందునుంచే ప్రేమించుకునేవారని చెప్పారు. పెళ్లి తరువాత భర్తను వదిలి వెళ్లిపోతే తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి.. పక్కా ప్లాన్ ప్రకారం తాను చనిపోయినట్లు నటించానని నీతూ చెప్పింది.


ప్రస్తుతం పోలీసులు చీటింగ్, క్రిమినల్ కాన్సిపిరసీ నేరాల కింద నీతూ, సోనూపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-08T06:02:21+05:30 IST