కొండపల్లిలో పోలీసుల అత్యుత్సాహం: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2021-11-14T01:59:24+05:30 IST
కొండపల్లిలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో
విజయవాడ: కొండపల్లిలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఇబ్రహీంపట్నం సీఐ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కొండపల్లి ఎన్నికల్లో ప్రచారం సమయం ముగియక ముందే.. టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రచార సమయం ముగిసినా వైసీపీ ప్రచారాన్ని అడ్డుకోవడం లేదని తప్పుబట్టారు. టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దేవినేని ఉమా మండిపడ్డారు.