AP News: తిరుపతిలో వృద్ధురాలి హత్య కేసును చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2022-08-16T18:13:17+05:30 IST
నగరంలోని భవానీ నగర్లో వృద్ధురాలు రాజేశ్వరి హత్య కేసును ఈస్ట్ పోలీసులు చేధించారు.
తిరుపతి: నగరంలోని భవానీ నగర్లో వృద్ధురాలు రాజేశ్వరి హత్య కేసును ఈస్ట్ పోలీసులు చేధించారు. బంగారు గొలుసు కోసం ఇటుక రాళ్లతో వృద్ధురాలుని నిందితులు హత మార్చారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని మంచం కింద దాచి... ఎవ్వరూ చూడని సమయంలో మురికి కాలువలో పడేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.