భద్రాద్రి కొత్తగూడెం హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-04-15T00:15:26+05:30 IST
గత సంవ్సతరం జిల్లాలో జరిగిన హత్య మిస్టరీని భద్రాద్రి పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు
భద్రాద్రి కొత్తగూడెం: గత సంవ్సతరం జిల్లాలో జరిగిన హత్య మిస్టరీని భద్రాద్రి పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని వారు పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 23న అంబేద్కర్ సెంటర్లోని ఓంకార్ ఫ్రూట్స్ దుకాణం పైన అనుమానాస్పద స్థితిలో యర్రంశెట్టి బసవ పార్వతమ్మ (68) మృతి చెందింది. డబ్బుల కోసం సొంత కొడుకే హత్య చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. నిందితుడిని మృతురాలి రెండో కొడుకు శ్రీనివాస్ రావుగా పోలీసులు గుర్తించారు. తన తల్లికి వచ్చిన ఆస్తి వాటాలో 9 లక్షల రూపాయలను శ్రీనివాస్ రావు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులను తిరిగి తనకు ఇవ్వాలని తన కొడుకును తల్లి అడిగిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో డబ్బులు ఇస్తానని నమ్మించి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన తల్లిని శ్రీనివాస్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.