విచారణ కోసం కోర్టుకు తీసుకువచ్చిన నిందితుడు పరార్.. దీని వెనుక ఎవరి హస్తముందో తెలిస్తే షాకవుతారు..
ABN , First Publish Date - 2021-11-21T17:15:10+05:30 IST
నెల్లాళ్ల క్రితం రాయపూర్(ఛత్తీస్గఢ్) కోర్టు నుంచి..
నెల్లాళ్ల క్రితం రాయపూర్(ఛత్తీస్గఢ్) కోర్టు నుంచి ఒక ఖైదీ పరారయ్యాడు. దీనికి వెనుక పోలీసు కానిస్టేబుల్ ప్లానింగ్ ఉందని వెల్లడయ్యింది. రాయపూర్కు చెందిన కానిస్టేబుల్ ఒక ఖైదీ తప్పించుకుని పారిపోయేందుకు సహకారం అందించాడు. పోలీసుల దర్మాప్తులో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ ఉదంతంలో కానిస్టేబుల్ రావేంద్ర ప్రసాద్ పటేల్పై కేసు కూడా నమోదు చేశారు. రాయపూర్ ఎస్పీ ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
సదరు కానిస్టేబుల్ను పిలిచి మందలించినట్టు సమాచారం. ప్రస్తుతం అతనిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం ఈ కానిస్టేబుల్ ఒక హత్య కేసులో బీహార్కు చెందిన నిందితుడు అనుపమ్ ఝాను కోర్టు ప్రాంగణానికి తీసుకు వచ్చాడు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టకముందే అతను పారిపోయాడు. ఈ నేపధ్యంలో కానిస్టేబుల్ రావేంద్రను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఇప్పటివరకూ వెల్లడయిన వివరాల ప్రకారం హంతకునికి జైలు నుంచి విముక్తి కల్పించేందుకు వారి కుటుంబీకులతో కానిస్టేబుల్ రావేంద్ర ప్రసాద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు హంతకుడు కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకునేందుకు సహకరించాడు. అనుకున్న విధంగా హంతకుడు పరారైన వెంటనే కానిస్టేబుల్ రావేంద్ర.. పోలీస్ స్టేషన్లో సదరు ఖైదీపై కేసు నమోదు చేయించాడు. ఈ విషయం వెలుగులోకి రాగానే పోలీసుశాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి.