మాస్క్ ధరించని వారిపై హుక్కు పాదం.. ఒక్క రోజే 100 కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-25T01:35:08+05:30 IST

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిపై హుక్కపాదం మోపారు. ఈ ఒక్కరోజే..

మాస్క్ ధరించని వారిపై హుక్కు పాదం.. ఒక్క రోజే 100 కేసులు నమోదు

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిపై హుక్కపాదం మోపారు. ఈ ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‎లు ధరించని వారిపై జరిమానాలు విధించారు. పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్ల్స్ తదితర కౌంటర్ల‎లో ఉండి మాస్క్ లు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇకపై ఈ డ్రైవ్ ప్రతిరోజు కొనసాగుతుందని, దుకాణాల యాజమాన్యాలు, వాటిలో పని చేసే ఉద్యోగులు తప్పకుండా మాస్క్‎లు ధరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని, కస్టమర్స్‎ని సోషల్ డిస్టెన్స్‎లో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఎంట్రీ వద్ద శానిటజైర్లు అందుబాటులో ఉంచాలి. నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-25T01:35:08+05:30 IST