రఘురామ కృష్ణరాజుపై వరుస పోలీసు కేసులు.. కట్టడి చేసే ప్రయత్నమా?
ABN , First Publish Date - 2020-07-10T13:38:21+05:30 IST
ఏలూరు: నరసాపురం యంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ అధిష్ఠానం బలప్రయోగానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
ఏలూరు: నరసాపురం యంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ అధిష్ఠానం బలప్రయోగానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసు ఫిర్యాదులతో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆయనపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. రఘురామ కృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. తణుకు, భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. కాగా.. ఫిర్యాదు స్వీకరించినా పోలీసు అధికారులు మాత్రం ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు. లీగల్ ఒపినియన్ తీసుకున్న తరువాతే కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.