TDP మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

ABN , First Publish Date - 2022-05-18T23:16:37+05:30 IST

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదు అయింది. డిప్యూటీ తాహశీల్దార్‌ విజయ్‌ కుమార్‌.. రేషన్‌ షాపుల్లో..

TDP మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

Vijayawada: టీడీపీ మాజీ Mla బోడే ప్రసాద్‌ (Bode Prasad)పై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదు అయింది. డిప్యూటీ తాహశీల్దార్‌ విజయ్‌ కుమార్‌ (Vijay Kumar) రేషన్‌ షాపుల్లో తనిఖీలకు వెళ్లారు. స్టాక్‌ వ్యత్యాసం ఉన్నందున్న రేషన్ షాపు నిర్వాహకుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అయితే బోడే ప్రసాద్‌, ఆయన అనుచరులు అక్కడకు వెళ్లారు. దీంతో బోడె ప్రసాద్‎తో పాటు ఆయన అనుచరులు.. తన విధులకు ఆటంకం కలిగించారని... తనపై దాడి చేశారంటూ (Deputy Tahasildar) విజయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోడె ప్రసాద్, అతని అనుచరులపై హత్యాయత్నం పాటు, పలు సెక్షన్ల కింద పోలీసులు Case నమోదు చేశారు. 

Updated Date - 2022-05-18T23:16:37+05:30 IST