ఆవు అంత్యక్రియలకు హాజరు.. 150 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-05-24T22:52:19+05:30 IST
ఒకపక్క కరోనా. మరో పక్క లాక్డౌన్ నిబంధనలు. ఈ రెండింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా...
లక్నో: ఒకపక్క కరోనా. మరో పక్క లాక్డౌన్ నిబంధనలు. ఈ రెండింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ ఆవు అంత్యక్రియలకు దాదాపు 150 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరందరిపైనా ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ గ్రామంలో గురువారం ఓ ఆవు మరణించింది. ఆ ఆవుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దాదాపు 150 మంది హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు. అయితే వీరిలో 25 మందిని గుర్తించామని, మరో 125 మందిని గుర్తించాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారి ఒకరు వివరించారు.