హైదరాబాద్‌లోని బోరబండలో ఎస్‌వోటీ పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-07-06T14:00:15+05:30 IST

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఓ ఇంటిపై బాలనగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. 12 కేజీల గంజాయి, షిఫ్ట్ డిజైర్ కారు, సెల్‌ఫోను

హైదరాబాద్‌లోని బోరబండలో ఎస్‌వోటీ పోలీసుల దాడి

హైదరాబాద్: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఓ ఇంటిపై బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. 12 కేజీల గంజాయి, షిఫ్ట్ డిజైర్ కారు, సెల్‌ఫోను, బాండ్ పేపర్‌లు స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠరావు అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారంతో ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నట్టు వైకుంఠరావు వెల్లడించాడు. నిందితుడ్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-06T14:00:15+05:30 IST