పార్క్హయత్ హోటల్లో బర్త్డే పార్టీపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-07-05T22:23:59+05:30 IST
పార్క్హయత్ హోటల్లో బర్త్డే పార్టీపై పోలీసుల దాడి
హైదరాబాద్: పార్క్హయత్ హోటల్లో బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. నలుగురు యువతులు, ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిలో జర్మనీకి చెందిన యువతి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గతంలో రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తే ఈ పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు.