మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా.. ఆ సమయంలో...
ABN , First Publish Date - 2020-07-12T01:20:12+05:30 IST
కరీంనగర్లో కొత్తపల్లి ఎస్ఐ వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఎస్ఐ ఎల్లాగౌడ్ అదే వాహనంలో ..
కరీంనగర్లో కొత్తపల్లి ఎస్ఐ వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఎస్ఐ ఎల్లాగౌడ్ అదే వాహనంలో ఉన్నారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్లో మంత్రి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగుల కమలాకర్ ఎస్కార్ట్గా వెళ్తున్న కొత్తపల్లి స్టేషన్ వాహనం ఆర్టీసీ వర్క్ షాపు వద్ద బోల్తా పడింది. స్థానికులు వాహనాన్ని పైకి లేపారు. ఘటనపై కమలాకర్ ఆరా తీశారు. ఎస్ఐని ఏసీపీ విజయ్ సారథి పరామర్శించారు.