అర్ధరాత్రి భారత్‌లోని ఇంట్లోకి దూరిన దొంగలు.. సీసీ టీవీలో చూసి ఈ NRI ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-20T00:07:22+05:30 IST

అతడు ఉన్నత చదువులు చదువి.. మంచి ఉద్యోగం సాధించాడు. అమెరికా నుంచి జాబ్ ఆఫర్ రావడంతో.. అక్కడికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా తనతోపాటే అమెరికా తీసుకెళ్లాడు. ఈ క్ర

అర్ధరాత్రి భారత్‌లోని ఇంట్లోకి దూరిన దొంగలు.. సీసీ టీవీలో చూసి ఈ NRI ఏం చేశాడంటే..

ఎన్నారై డెస్క్: అతడు ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం సాధించాడు. అమెరికా నుంచి జాబ్ ఆఫర్ రావడంతో.. అక్కడికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా తనతోపాటే అమెరికా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటిని ప్రతి రోజూ కళ్లార చూసుకునేందుకు ఇంటి చుట్టు, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు. తాజాగా తన ఇంట్లో దొంగలు దూరినట్టు అతడు గమనించాడు. ఆ తర్వాత ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన విజయ్ అవస్తి చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. న్యూజెర్సీలో జాబ్ సంపాదించాడు. కొన్ని రోజులపాటు జాబ్ చేసిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను కూడా తనతోపాటే అమెరికా తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్‌లో ఉన్న ఇంటి చుట్టు, ఇంటి లోపలి భాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాడు. అమెరికా వెళ్లిన తర్వాత కూడా సీసీ కెమెరాల ద్వారా ఇంటిని తరచూ చూసుకుంటూ ఉండేవాడు. 



తాజాగా మంగళవారం కూడా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తుండగా.. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు విజయ్ గుర్తించాడు. వెంటనే..  అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇంట్లో ఏర్పాటు చేసిన స్పీకర్ల ద్వారా ఆ ఇద్దరినీ విజయ్ హెచ్చరించాడు. అయితే విజయ్ మాటను వాళ్లు.. పెడచెవిన పెట్టారు. అంతేకాకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో విజయ్.. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులను చూసి.. ఆ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపి సోనూ అనే వ్యక్తి కాలిపై షూట్ చేశారు. అనంతరం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా.. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-01-20T00:07:22+05:30 IST