ఉగాది పురస్కారాలకు పలువురు ఎంపిక

ABN , First Publish Date - 2021-04-13T06:42:00+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలకు పోలీస్‌, ఫైర్‌ సర్వీసెస్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న పలువురు అధికారుల తోపాటు సిబ్బంది ఎంపికయ్యారు.

ఉగాది పురస్కారాలకు పలువురు ఎంపిక
ఉగాది పురస్కారాలకు ఎంపికైన విజిలెన్స్‌ డీఎస్పీ సుబ్బారెడ్డి, కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 12: ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలకు పోలీస్‌, ఫైర్‌ సర్వీసెస్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న పలువురు అధికారుల తోపాటు సిబ్బంది  ఎంపికయ్యారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీగా పని చేస్తున్న కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డికి మహోన్నత సేవా పతకం దక్కింది.  కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారిగా ఉన్న ఎస్‌.శ్రీనివాస రావును ఉత్తమ సేవా పతకం వరించింది. పోలీస్‌ శాఖలో ఉత్తమ సేవా పతకానికి ఏఆర్‌ ఎస్సై ఎం.బలరాముడు, సేవా పతకానికి ఎస్సై పత్తిపాటి మధు, ఏఎస్సై కె.మస్తాన్‌, ఏఆర్‌ ఎస్సై ఆర్‌.సుబ్బారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శామ్యూల్‌బాజీ, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వీవీబీరెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు టి.సింగయ్య, కె.అల్లూరురెడ్డి, విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ వై.రమేష్‌, ఫైర్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న పి.డేవిడ్‌ రాజు, కె.యలమందలు ఎంపికయ్యారు. 

Updated Date - 2021-04-13T06:42:00+05:30 IST