Secundrabad రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల అలెర్ట్
ABN , First Publish Date - 2022-06-20T14:08:52+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్(Bharath bandh)కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. అగ్నిపథ్ను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలెర్ట్ ప్రకటించాయి. ఈ నెల 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా అలెర్ట్ చేస్తున్నారు.