కృష్ణాజిల్లా..కేజీ బంగారం, 9 కేజీల వెండి పట్టివేత
ABN , First Publish Date - 2020-05-31T02:15:26+05:30 IST
జిల్లాలోని తిరువూరులో అంతర్ రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు జరిపారు.
కృష్ణా: జిల్లాలోని తిరువూరులో అంతర్ రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు జరిపారు. కేజీ బంగారం, 9 కేజీల వెండి, రూ.53.28 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నగదు, నగలను ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.