రాజకీయ వేధింపులు మానుకోవాలి

ABN , First Publish Date - 2021-04-13T06:51:27+05:30 IST

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు మానుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా నాయకురాలు పి.సత్యవతి అన్నారు.

రాజకీయ వేధింపులు మానుకోవాలి

కె.గంగవరం, ఏప్రిల్‌ 12: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు మానుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా నాయకురాలు పి.సత్యవతి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్రం వద్ద సోమవారం నిరసన తెలిపారు.  వినతిపత్రాన్ని మండల వనరుల కేంద్రం సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో  మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ముగ్గుల సూర్యాకాంతం, దొమ్మెటి సుబ్బాయమ్మ, సూరంపూడి లక్ష్మి అనసూరి నాగమణి పాల్గొన్నారు.



Updated Date - 2021-04-13T06:51:27+05:30 IST