పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-05-28T20:29:13+05:30 IST

గోదావరి నదిపై పోలవరం పూర్తి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మహానాడులో చంద్రబాబు

పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

అమరావతి: గోదావరి నదిపై పోలవరం పూర్తి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఒడిశా బార్డర్ వరకు నీటిని తీసుకెళ్లాలని చెప్పారు. తమ హయాంలో 69 ప్రాజెక్టులకు 24 ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామని, తోటపల్లి రిజర్వాయర్ దగ్గరే ఉండి పనులు పూర్తి చేశామని తెలిపారు. పట్టిసీమ ఏడాదిలో పూర్తి చేసి నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టామని, రెండేళ్లల్లో సీఎం జగన్ నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.1000 కోట్లకు మించి ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం చేతగానితనంతో గాలేరు నగరి, హంద్రీ నీవా పనులు ఆగిపోయాయని, వ్యవయసాయంలో వరుసగా ఐదేళ్లు 11 శాతం జీఎస్డీపీ సాధించిన ఘనత టీడీపీదేనని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక్క ఎకరం భూ సేకరణ చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2021-05-28T20:29:13+05:30 IST