పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
ABN , First Publish Date - 2020-07-11T08:50:48+05:30 IST
పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
హైదరాబాద్, జులై 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు ఇరిగేషన్ శాఖ ఈఎన్ సీ మురళీధర్రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఇలా నీటిని మళ్లించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.