పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన క్వాలిటీ ఎస్ఈ
ABN , First Publish Date - 2021-12-09T05:43:42+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్ను క్వాలిటీ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి బుధవారం పరిశీలించారు.
పోలవరం, డిసెంబరు 8: పోలవరం ప్రాజెక్ట్ను క్వాలిటీ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి బుధవారం పరిశీలించారు. స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను ఆయన పరిశీలించారు. కుడి ప్రధాన కాలువ లో ముఖ్యమైన హెడ్ రెగ్యులేటర్, ఈ, ఎఫ్ శాడిల్ డ్యామ్లు, 63, 64 ప్యాకేజీలలో ట్విన్ టన్నెల్లను ఆయ న పరిశీలించారు. ఇన్చార్జ్ ఈఈ బాలకృష్ణ పనుల పురోగతి తదితర అంశాలను వివరించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ నరసింహమూర్తి కుడి ప్రధాన కాలువ, ఈ,ఎఫ్ శాడిల్ డ్యామ్, ట్విన్ టన్నెల్ పనులు పరిశీలించి వెళ్లారు.