పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లోకి గోదావరి వరద

ABN , First Publish Date - 2020-07-10T17:24:55+05:30 IST

పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లోకి గోదావరి వరద నీరు చేరింది. దీంతో పనులకు ఆటంకం ఏర్పడింది. అయితే, గతంలో వరద వస్తే స్పిల్ చానల్‌లోకి నీరు రాకుండా అధికారులు

పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లోకి గోదావరి వరద

పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లోకి గోదావరి వరద నీరు చేరింది. దీంతో పనులకు ఆటంకం ఏర్పడింది. అయితే, గతంలో వరద వస్తే స్పిల్ చానల్‌లోకి నీరు రాకుండా అధికారులు అడ్డుకుట్ట వేశారు. ఇప్పుడు ఆ అడ్డుకట్టకు లీకేజ్ ఏర్పడడంతో స్పిల్ ఛానల్‌లోకి వరద నీరు చేరింది. దీంతో స్పిల్ చానల్ పనులను నిలిపివేశారు. మరోవైపు కాపర్ డ్యాం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 20.40 మీటర్లకు చేరింది. కాగా, వరద కారణంగా స్పిల్ వే వద్ద ఎలాంటి ఇబ్బంది లేదిన అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-10T17:24:55+05:30 IST