Polavaram ప్రాజెక్ట్ వద్ద భారీగా పెరిగిన గోదావరి వరద
ABN , First Publish Date - 2022-07-16T17:33:26+05:30 IST
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 36.76 మీటర్లకు చేరింది.
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు(Polavaram project) వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 36.76 మీటర్లకు చేరింది. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ఎత్తి వేసి 21.45లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి అంబటి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.