45వ రోజు నిర్వాసితుల దీక్షలు

ABN , First Publish Date - 2022-01-24T06:08:18+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వాసితుల దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి.

45వ రోజు నిర్వాసితుల దీక్షలు
దీక్ష శిబిరంలో నిర్వాసితులు

పోలవరం, జనవరి 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వాసితుల దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి. వాడపల్లి నుంచి దీక్షలో పాల్గొన్న గంగరాజు తదితరులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానని పట్టించుకో లేదన్నారు. కాఫర్‌ డ్యామ్‌  వద్ద ఉభయ గోదావరి జిల్లాల నిర్వాసితులు పనులు ఆపితే సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో స్వగ్రామా లకు తిరిగివెళిపోతామన్నారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పఽథకాలతో ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం 72  కోట్లు వేయడం పెద్దపనికాదని ఉద్దేశ్యపూర్వకంగానే పరిహారాలు నిలిపి వేశారని వారు విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిర్వాసితుల ఐక్యవేదిక నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:08:18+05:30 IST