Polavaram projectకు డెడ్లైన్ అంటూ ఏమీ లేదు: అంబటి
ABN , First Publish Date - 2022-06-02T01:48:57+05:30 IST
పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం పూర్తి కావడానికి ఎటువంటి డెడ్లైన్ లేదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పష్టం చేశారు.
ధవళేశ్వరం: పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం పూర్తి కావడానికి ఎటువంటి డెడ్లైన్ లేదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందని విమర్శించారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ చేపట్టడం చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణానికి మరమ్మతులు చేపట్టాలా... లేక కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మించాలా అనే విషయంలో నిపుణులు ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu), మాజీమంత్రి దేవినేని ఉమ తీసుకున్న నిర్ణయాలు నేడు పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయని అంబటి రాంబాబు విమర్శించారు.