జాతీయ రహదారిని నాణ్యతతో నిర్మించాలి: ఎమ్మెల్యే బాలరాజు
ABN , First Publish Date - 2022-02-05T21:44:00+05:30 IST
జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జాతీయ రహదారి పనులను
బుట్టాయిగూడెం (పశ్చిమ గోదావరి): జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జాతీయ రహదారి పనులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు రూ.30.00 కోట్ల అంచనాలతో NH 365 BB జాతీయ రాహదారిని నిర్మిస్తున్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పూర్తి క్వాలిటితో రహదారిని నిర్మించాలని అధికారులకు సూచనలు చేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ మోడియం రామలక్ష్మి, వైస్ ఎంపీపీ 2 గుగ్గులోత్ మోహనరావు, సర్పంచ్ కుంజా దుర్గమ్మ, ఎంపీటీసీ కొవ్వాసి వరలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.