పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-08-15T14:49:29+05:30 IST

భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదవరి జిల్లాలో పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ఏలూరు: భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదవరి జిల్లాలో పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం కాపర్ డ్యాం వద్ద వరద నీరు 27.1 మీటర్లకు చేరింది. అటు వరద ప్రవాహంతో పైడిపాక వద్ద గోదావరి నది గట్టుకు గండి పడటంతో స్పిల్వేలోకి వరద నీరు ప్రవేశిస్తోంది. దీంతో కొత్తూరు కాజ్వే పూర్తిగా నీట మునిగింది. దాదాపు 19 నిర్వాసిత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-15T14:49:29+05:30 IST