కరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులపై పోలాండ్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-05-05T22:30:14+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఇతర ఏ దేశంలో లేని మాదిరిగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చాలా దేశాలు భార

కరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులపై పోలాండ్ కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఇతర ఏ దేశంలో లేని మాదిరిగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చాలా దేశాలు భారత్‌ నుంచి రాకపోకలను నిలిపివేశాయి. తాజాగా పోలాండ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులకు క్వారెంటైన్ నిబంధనను తప్పనిసరి చేసింది. పోలాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వేరియంట్‌కు సంబంధించిన కేసులు తమ దేశంలో నమోదైనట్టు తెలిపారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన పోలాండ్ దౌద్యవేత్త కుటుంబం కూడా కరోనా బారినపడ్డారని చెప్పారు. ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలనే నిబంధనను తీసుకొచ్చినట్టు చెప్పారు. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల ప్రయాణికులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-05T22:30:14+05:30 IST