విద్యా విధానంపై నేడు ప్రధాని ప్రసంగం

ABN , First Publish Date - 2020-08-07T07:58:33+05:30 IST

నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు...

విద్యా విధానంపై నేడు ప్రధాని ప్రసంగం

న్యూఢిల్లీ, ఆగస్టు 6: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై  శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధాని  మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.    


అవగాహన కల్పించాలి: యూజీసీ ఆదేశాలు
ఉన్నత విద్యా వ్యవస్థలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, అందులో భాగస్వాములైన ఇతరులకు జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)పై అవగాహన కలిగించాలని యూజీసీ దేశంలోని విశ్వవిద్యాలయాలను, కళాశాలలను ఆదేశించింది. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల పర్యవే క్షణకు సంబంధించి యూజీసీ నిర్వహించే పోర్టల్‌ను పరిశీలించాలని విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు సూచించింది.  

Updated Date - 2020-08-07T07:58:33+05:30 IST