విద్యా విధానంపై నేడు ప్రధాని ప్రసంగం
ABN , First Publish Date - 2020-08-07T07:58:33+05:30 IST
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 6: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.