గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-26T06:41:50+05:30 IST

గ్రామీణ వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి చట్ట బద్ధత కల్పించాలని పీఎంపీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజాసిద్ధార్థ ప్రభు త్వాన్ని డిమాండు చేశారు.

గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి

అంతర్వేది, జనవరి 25:  గ్రామీణ వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి చట్ట బద్ధత కల్పించాలని పీఎంపీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజాసిద్ధార్థ ప్రభు త్వాన్ని డిమాండు చేశారు. గ్రామీణ వైద్యులకు అనుకూలంగా ఉన్న 2008లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 429 జీవోను పునరుద్ధరించాలని కోరారు.  అంతర్వేది తీర ప్రాంతంలో రాష్ట్ర ఫెడరేషన్‌ ఎండీ రఫీ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కంబాల బాబూరావు, జంగం జోషి, చప్పిడి వెంకటేశ్వరరావు, పోతురాజు చిట్టిబాబు, యెనుముల వెంకట్రామయ్య, ఎం.జేసురత్నం, ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T06:41:50+05:30 IST