Somnath Templeలో కొత్త సర్క్యూట్ హౌస్

ABN , First Publish Date - 2022-01-21T12:46:01+05:30 IST

సోమనాథ్ ఆలయ భక్తులకు శుభవార్త. గుజరాత్‌ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయం సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్‌ను...

Somnath Templeలో కొత్త సర్క్యూట్ హౌస్

ప్రధాని మోదీ ప్రారంభం

న్యూఢిల్లీ: సోమనాథ్ ఆలయ భక్తులకు శుభవార్త. గుజరాత్‌ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయం సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.కొత్త సర్క్యూట్ హౌస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. సోమనాథ్ ఆలయం సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ప్రారంభం వల్ల యాత్రికులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చి సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రస్థుతం ఉన్న అతిథి గృహాలు ఆలయానికి దూరంగా ఉండటంతో కొత్త సర్క్యూట్ హౌస్ అవసరం ఏర్పడింది.


 30కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అధునాతన సర్క్యూట్ హౌస్ సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కొత్త సర్య్యూట్ హౌస్ లో సూట్ లు, వీఐపీ, డీలక్స్ గదులు,కాన్ఫరెన్స్ రూం, ఆడిటోరియం సౌకర్యాలున్నాయి. ప్రతి గది నుంచి సముద్రం కనిపించేలా ల్యాండ్ స్కేపింగ్ చేశారు. 


Updated Date - 2022-01-21T12:46:01+05:30 IST