దక్షిణాది రాష్ట్రాల BJP ఎంపీలతో ప్రధాని భేటీ

ABN , First Publish Date - 2021-12-15T15:29:28+05:30 IST

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు.

దక్షిణాది రాష్ట్రాల BJP ఎంపీలతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ:  దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో బీజేపీ ఎంపీలకు మోదీ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోదీ పిచ్చాపాటి నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆనవాయితీగా  వస్తున్న వివిధ రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. మోదీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు హాజరవగా... ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు జీవీఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T15:29:28+05:30 IST